Saturday, June 14, 2025

విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ లో జరిగి ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్‌లోని బన్స్వారాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వృత్తిరీత్యా లండన్‌లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య డాక్టర్ కోమి వ్యాస్ వారి ఇద్దరు కుమారులు నకుల్, ప్రద్యుత్.. కూతురు మిరాయ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాదానికి ముందు తమ పిల్లలతో కలిసి ఈ జంట విమానంలో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరితో సహా రాజస్థాన్‌కు చెందిన మొత్తం 10 మంది ఈ ఘటనలో మృతి చెందారు. కాగా,  విమాన ప్రమాదంలో మొత్తం 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మరణించగా.. మెడికల్ కాలేజీపై కూలడంతో మరో 24 మంది మృతి చెందారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి కూడా ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News