Saturday, June 14, 2025

‘మిత్ర మండలి’కి ‘జాతిరత్నాలు’ స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

బన్నీ వాస్ (Bunny Was) నూతన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మిత్ర మండలి. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్. ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ‘మిత్ర మండలి’ టీజర్ ను నిర్మాతలు విడుదల చేశారు. టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ఏఏఏ సినిమాస్‌లో జరిగింది.

ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ “బన్నీ వాసు సమర్పిస్తున్న మొదటి సినిమాగా, నా మిత్రులందరూ కలిసి తీసిన ఈ ‘మిత్ర మండలి’ టీజర్ ను లాంచ్ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. ప్రియదర్శి కోర్ట్ సినిమాలో అద్భుతంగా నటించాడు. సోషల్ మీడియాలో నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. టీజర్ చాలా బాగుంది. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర సమర్పకులు, నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “ఒక నలుగురు కుర్రాళ్ళు కలిసి చేసే బడ్డీ కామెడీ ఎలా ఉంటుందో.. మిత్ర మండలి అలా ఉంటుంది. ఇలాంటి సినిమా తీయడానికి ‘జాతిరత్నాలు’ (National Jewels) స్ఫూర్తి. సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా, నిహారిక అందరూ అద్భుతంగా నటించారు.

ముఖ్యంగా వెన్నెల కిషోర్, – సత్య ట్రాక్ అదిరిపోతుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం”అని తెలిపారు. చిత్ర దర్శకుడు విజయేందర్ ఎస్ మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది. నేను రాసిన కామెడీని నటీనటులంతా తెరమీద అద్భుతంగా పండించారు”అని తెలియజేశారు. చిత్ర కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చింది కదా. సినిమా అంతకుమించి ఎన్నో రెట్లు వినోదాన్ని పంచబోతుంది. ఈ సినిమా థియేటర్లలో అందరినీ నవ్విస్తుందని నమ్ముతున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనుదీప్ కె.వి, ఎస్.కె.ఎన్, భాను ప్రతాప, నిహారిక తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News