- Advertisement -
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 297కు పెరిగింది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా నిర్ధారించబడింది. ఒక్క ప్రయాణీకుడు మాత్రమే ఈ విషాదం నుండి బయటపడ్డాడు. మృతులలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై విమానం కూలడంతో మరో 56 మంది మరణించారు. కాగా, అహ్మదాబాద్లో దిగి ప్రమాద స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని కలిసి పరామర్శించనున్నారు. కాగా, నిన్న హోంమంత్రి అమిత్ షా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.సంఘటనకు సంబంధించిన వివరాలపై ఆయన ఆరా తీశారు. ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
- Advertisement -