ముంబై: మరో విమాన ప్రమాదం తప్పింది. శుక్రవారం ఉదయం ముంబయి నుండి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం తిరిగి వెనక్కి వచ్చింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ముంబయి నుంచి లండన్కు బయలుదేరి మూడు గంటల ప్రయాణం తర్వాత విమానం వెనక్కి మళ్లినట్లు ఎయిరిండియా తెలిపింది. ఫ్లైట్ రాడార్ 24 ద్వారా ఈ విషయాన్ని నిర్ధారించారు. ఫ్లైట్ ట్రాకింగ్ పోర్టల్ FlightRadar24 నుండి వచ్చిన డేటా ప్రకారం.. విమానం AIC129 ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వస్తున్నట్లు చూపించింది. విమానం U-టర్న్ తీసుకొని తిరిగి వస్తున్నట్లు రాడార్ గుర్తించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులతో ఇరాన్ గగనతలంపై ఆంక్షలు విధించింది. తమ వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా విమానం తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.
“ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్తిత పరిస్థితుతలోత వైమానిక ప్రాంతం మూసివేయడంతో మా ప్రయాణీకుల భద్రత దృష్ట్యా పలు విమానాలను దారి మళ్లించడం లేదా తిరిగి వెనక్కి రావడం జరుగుతోంది” అని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.