అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుండి తప్పించుకుని ప్రాణాలతో బయట పడిన వ్యక్తిని ప్రధాని మోడీ కలిశారు. విమాన ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ప్రధాని శుక్రవారం అహ్మదాబాద్ కు వెళ్లారు. మొదట సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన ఆయన.. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలిసి పరామర్శించారు. ఈ ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణిస్తున్నవారిలో అందరూ చనిపోగా.. విశ్వాస్ కుమార్ రమేష్ అనే వ్యక్తి ఒక్కడే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఆస్పత్రికి వెళ్లిన ప్రధాని.. అక్కడ చికిత్స పొందుతున్న విశ్వాస్ ను పరామర్శించి అతనితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
కాగా, ఘనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 297కు చేరుకుంది. విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. మృతులలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. మెడికల్ కాలేజీ హాస్టల్పై విమానం కూలడంతో మరో 56 మంది మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.