Sunday, June 15, 2025

ఎయిర్‌ఇండియా విమానం అత్యవసర లాండింగ్.. కారణం ఏంటంటే..

- Advertisement -
- Advertisement -

థాయిలాండ్: గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఒకరు తప్ప విమానంలోని ఉన్న అందరూ మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం నుంచి తేరుకోకముందే మరో ఎయిర్ ఇండియా (Air India)  విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ఇండియా ఎఐ379 విమానం ఉదయం 9.30 గంటలకు న్యూఢిల్లీకి బయలుదేరింది. అయితే ఈ విమానంలోని బాత్‌రూం గోడపై బాంబు బెదిరింపు (Bomb Threat) రాసి ఉంది. దీన్ని గుర్తించిన వెంటనే పైలట్‌ విమానాన్ని తిరిగి ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News