Sunday, June 15, 2025

విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాపై మండిపడ్డ నటి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం యావత్ భారత దేశాన్ని కలచివేసింది. ఈ ఘటన తర్వాత పలువురు విమానం ఎక్కాలంటే భయపడుతున్నారు. చాలా మంది విమాన టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఎయిర్ ఇండియా (Air India) విమాన ప్రయాణంలో భద్రత గురించి అంతా భయపడుతున్నారు. అయితే నటి ప్రియాంక చోప్రా సోదరి మీరా చోప్రా (Meera Chopra) భర్త కూడా ఎయిర్ ఇండియా విమానంలో ఈ నెల 15వ తేదీన దుబాయ్ వెళ్లాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదం తర్వాత ఆయన తన ప్రయాణన్ని రద్దు చేసుకున్నారు. కానీ, విమాన టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేందుకు ఎయిర్ ఇండియా నిరాకరించింది.

దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. ఎయిర్ ఇండియా (Air India) తీరుపై ఆమె ఎక్స్ వేదికగా మండిపడింది. తన భర్త విమాన ప్రయాణాన్ని భద్రత కారణాల దృష్ట్యా రద్దు చేసుకున్నామని.. కానీ, ఎయిర్ ఇండియా వారికి ఎటువంటి సూచన రాలేదని పేర్కొంటూ.. టికెట్ ధర మొత్తాన్ని చెల్లించడానికి నిరాకరించిందని మీరా (Meera Chopra) తెలిపింది. టాటా గ్రూప్స్ నడుపుతున్న ఎయిర్ ఇండియా సంస్థ అంటే గర్వపడతాం.. కానీ, ఈ రోజు జరిగింది చూశాక వారు విమానాలు నడుపుతున్న తీరు తీవ్ర నిరాశపరిచిందని పేర్కొంది. ఈ ఘటన ఎయిర్ ఇండియా సంస్థకు సిగ్గుచేటు అని.. 241 మంది ప్రాణాలు కోల్పోయిన సంస్థ అస్సలు పట్టించుకోదంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

అయితే దీనిపై పలువురు నెటిజన్లు మీరాకు కౌంటర్ ఇస్తున్నారు. టికెట్ కాన్సిలేషన్ గురించి ముందే చదువుకోవాలని.. ఎప్పుడు కావాలంటే అప్పుడు టికెట్ ప్రయాణ సమయం మార్చడం కుదరదని కామెంట్ చేస్తున్నారు. మీ సొంత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకుంటే.. డబ్బులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని జవాబు ఇస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News