Sunday, June 15, 2025

నా తల్లి, కూతురు కనిపించడంలేదు

- Advertisement -
- Advertisement -

బిజె మెడికల్ కాలేజ్ హాస్టల్ మెస్‌లో తన తల్లి, చిన్న కూతురు ఉండగా ఎయిర్ ఇండియా విమానం కూలిందని, వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ తెలియడం లేదని రవి ఠాకుర్(24) ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కాలేజ్ హాస్టల్ మెస్‌పై కూలిందన్నది తెలిసిన విషయమే. ‘నా తల్లి, నా భార్య, నేను బిజె మెడికల్ కాలేజ్ మెస్‌లో పనిచేస్తుంటాము. లంచ్ కోసం జూనియర్ డాక్టర్లు మెస్‌కు వస్తుంటారు. కాగా సీనియర్ డాక్టర్లకు ఆహారపు పొట్లాలను టిఫిన్ సర్వీస్‌లో భాగంగా సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళుతుంటారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు మేము ఆహారాన్ని ప్యాక్ చేసి సివిల్ హాస్పిటల్‌కు వెళ్లాము. అప్పుడు నా తల్లి, నా చిన్నారి కూతురు హాస్టల్‌లోనే ఉన్నారు’ అంటూ దిక్కుతోచని రవి ఠాకుర్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

‘నేను గత 24 గంటల్లో సివిల్, ప్రయివేట్ హాస్పిటల్స్ సహా అన్ని చోట్ల వెతికాను. కాని వారీ ఆచూకీ దొరకడంలేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. నా తల్లి పేరు సరళ, కూతురి పేరు ఆద్య’ అతడు వాపోతున్నాడు. ‘గల్లంతైన విద్యార్థులంతా దొరికారు. కేవలం నా తల్లి, కూతురు మాత్రం కనిపించడం లేదు. కాపలాదారులు ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు’ అని బోరుమంటున్నాడు.విమానం కూలినప్పుడు మేము సిలిండర్ పేలిందేమో అనుకున్నాము. కానీ అంతకు మించి ఏదో జరిగిందనిపించేసరికి మేము మా ప్రాణాలు కాపాడుకోడానికి పరుగులు తీశాము. మా తాళపుచెవులు, ఫోన్లను కూడా అక్కడే వదిలేసి పరుగులు తీశాము’ అని మీనా మిస్త్రీ అనే మరో వంటగత్తె తెలిపింది. ‘మేము 15 మంది వంటవాళ్లం ఓ టీమ్‌గా పనిచేస్తుంటాం. డాక్టర్లు, విద్యార్థులకు మేము గత 30 ఏళ్లుగా వండిపెడుతున్నాము. పేలుడు అగ్నికీలలు చూసి మేము ఏమి ఆలోచించకుండా పరుగులు పెట్టాము’ అని మరో వంటగత్తె నీమాబేన్ నిగం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News