Thursday, June 19, 2025

కాసేపట్లో ప్రమాద స్థలానికి చేరుకోనున్న డిజిసిఎ

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: డిజిసిఎ కాసేపట్లో విమాన ప్రమాద స్థలానికి చేరుకోనుంది. ఘటనా స్థలంలో ఎఎఐబి, ఎన్ఐఎ బృందాలు పరిశీలించనున్నాయి. దర్యాప్తు పూర్తయ్యే వరకు విమాన శకలాలు తొలగించొద్దని డిజిసిఎ ఆదేశించిన విషయం తెలిసిందే. డిజిసిఎ ఆదేశాలతో విమాన ప్రమాదం జరిగిన స్థలంలో క్లీనింగ్ పనులు నిలిచిపోయాయి. ఎయిరిండియా బోయింగ్ 787 రకం డ్రీమ్‌లైనర్ విమానాలన్నింటిని సాంకేతికపరంగా పరిశీలించాల్సి ఉంటుందని ఏవియేషన్ నిఘా సంస్థ డిజిసిఎ ఆదేశించిన విషయం తెలిసిందే.

బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానం బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు ఈ బ్లాక్‌బాక్స్ అత్యంత కీలకం కానుంది. అనుకోని దుర్ఘటనలు విమానాల్లో సంభవించినప్పుడు లోపల అంతిమక్షణాలలో పరిస్థితిని ఈ బ్లాక్‌బాక్స్ రికార్డు చేస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 274కు చేరుకుంది. మృతులలో 241 మంది ప్రయాణికులు, సిబ్బంది, స్థానిక ప్రజలు ఉన్నారు.

బ్లాక్ బాక్స్:

ప్లేన్లలో భ ద్రపరిచే ఉండే బ్లాక్‌బాక్స్‌లలో రెండు ముఖ్య భా గాలు ఉంటాయి. ఒకటి ఫ్లేయిట్ డేటా రికార్డర్ ( ఎఫ్‌డిఆర్).రెండోది కాక్‌పిట్‌వాయిస్ రికార్డర్ (సివిఆర్ ). విపత్కర పరిస్థితుల మధ్య పైలట్ ఇతర విమాన సి బ్బంది సంభాషణ, వారు తెలిపిన వివరాలు ఇందులో నిక్షిప్తం అవుతాయి. ఇవి చెక్కుచెదరకుడా ఉంటాయి. ఎఫ్‌డిఆర్‌తో విమానంలో తలెత్తిన తుది క్షణపు సాంకేతిక సమస్యలు, సవరించుకోవడానికి వీల్లేని క్లిష్టతల విషయాలు పొందుపర్చి ఉంటాయి. ఇక ఇద్దరు పైలట్ల తుది మాటలు సివిఆర్‌లో నిక్షిప్తం అవుతాయి.

ఇవి ప్రమాద కారణాల విశ్లేషణకు ఉపయోగపడుతాయని అధికారులు తెలిపారు. సాధారణంగా బ్లాక్‌బాక్స్‌ను ప్లేన్ చివరి భాగంలో అమర్చి ఉంచుతారు. విమానం ఎప్పుడూ దాని అబిముఖం వైపు కూలిపోతుంది. బ్లాక్‌బాక్స్ వెనుక వైపు ఉండటం , ఇది దుర్భేధ్యం కావడతో ఇందులో అన్ని విషయాలు పదిలపర్చుకుని ఉంటాయి. అత్యంత వేడిమి అంటే దాదాపు 1,100 సెంటీగ్రేడ్‌ల వేడిని కూడా తట్టుకుని ఇందులో సమాచారం కనీసం గంట వరకూ భద్రంగా ఉంటుంది. బ్లాక్‌బాక్స్ కాకుండా విమానంలో ఉండే డిజిటల్ వీడియో రికార్డర్ (డివిఆర్) కూడా దర్యాప్తునకు సహకరిస్తుంది. విమానంలోని పలు సిసికెమెరాలలో అంతిమ దశలలో నెలకొన్న పరిస్థితి ఈ పరికరంలో భద్రపర్చి ఉండేలా అమరికలు ఉంటాయి. కాక్‌పిట్, క్యాబిన్‌లలోని పరిణామాలను, పరిస్థితులను సరైన రీతిలో అంచనావేసేందుకు ఈ ఏర్పాటు దోహదం చేస్తుంది. దీనితో దర్యాప్తు క్రమంలో సంబంధిత దృశ్య రూప వీడియోలు ద్వారా పలు కీలక విషయాలు, ప్రత్యేకించి విమానంలో విపత్కర పరిస్థితుల్లో ఏమి జరిగింది? ఎందుకు జరిగింది? అనేది తేల్చుకోవడానికి వీలేర్పడుతుంది.

పూర్తి స్థాయి దర్యాప్తుతోనే ప్రమాద కారణాల నిర్థారణ : నిపుణులు
ఏదైనా విమాన ప్రమాదం జరిగినప్పుడు కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు క్రమంలో కానీ వెలుగులోకి రావని వైమానిక విషయాల నిపుణులు తెలిపారు. ముందుగా ప్రాధమిక స్థాయిలో కొన్ని కారణాలను విశ్లేషించుకోవడం జరుగుతుంది. అయితే సమగ్ర దర్యాప్తు తరువాతనే ఖచ్చిత రీతిలో ప్రమాద లోగుట్టును నిర్థారించుకునేందుకు వీలవుతుంది. కారణాలు ఏమై ఉంటాయనేది వెంటనే చెప్పడం కష్టం అని, గగనతలంలో లేదా విమానంలో తలెత్తే పరిణామాలు పూర్తి స్థాయి దర్యాప్తు తరువాతనే నిర్థారితం అవుతాయని వివరించారు. బుధవారం ప్రమాదానికి గురై, భారీ సంఖ్యలో ప్రాణ నష్టానికి దారితీసిన విమానం ఉదంతంపై నిపుణులు శుక్రవారం స్పందించారు. ఇక ఇప్పటి డ్రీమ్‌లైనర్ విమానం చరిత్ర పరిశీలిస్తే కొన్ని వివాదాస్పద అంశాలు ఉండవచ్చు.

అయితే దీని సాంకేతిక అంశాలను విశ్లేషించుకుంటే ఇది విమానరంగ పరిశ్రమకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఈ డ్రీమ్‌లైనర్ ఇటువంటి ప్రమాదానికి గురి కావడం ఇదే తొలిసారి అని ఎయిరిండియా మాజీ కార్యనిర్వాహకులు జితేంద్ర భార్గవ తెలిపారు. ఇప్పటి విమాన ప్రమాదానికి కారణాలు ఏమిటనేవి వెనువెంటనే చెప్పడం సశాస్త్రీయం అన్పించుకోదు. పక్షి ఢీ ఘటన జరిగిందా? లేక ఇంధన జ్వలన కారణమా అనేవి ఏవి కూడా నిర్థారిత అంశాలు కావని ఆయన వెల్లడించారు. భారీ ప్రమాదంపై పలు ఊహాగానాలు నష్టాన్ని కల్గిస్తాయి. దర్యాప్తు విశ్వసనీయతను దెబ్బతీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎయిర్‌లైన్ పరిశ్రమం వారు కానీ, మీడియా వారు కానీ ప్రమాదం కారణాలపై ఇప్పటికిప్పుడు ఎటువంటి అభిప్రాయాలకు రాకూడదు. పూర్తి స్థాయి దర్యాప్తు ముగిసే వరకూ వేచి ఉండటం మంచిదని సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News