అఖండ చిత్రానికి సీక్వెల్గా అఖండ 2: తాండవంతో థియేటర్లలో సందడి చేయనున్నారు హీరో నందమూరి బాలకృష్ణ. బోయపాటి శ్రీను డైరెక్టర్. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. బాలయ్య బర్త్ డే సందర్బంగా వచ్చిన అఖండ టైటిల్ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. పాన్ ఇండియా వైడ్గా వస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు.
అయితే, అఖండ 2 చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్స్ ప్రస్తుతం జరుగుతున్నాయట. చిత్రయూనిట్ దాదాపు 80 కోట్ల వరకు చెబుతోందట. ఈ మూవీ రైట్స్ ని ఓటీటీ కొనడానికి అమెజాన్ ప్రయత్నిస్తోందట. మరి 80 కోట్లు పెట్టి ఈ చిత్రాన్ని అమెజాన్ సొంతం చేసుకుంటుందా?లేదా? అనేది చూడాలి. అఖండ 2 చిత్రం ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా ఈ రెండు చిత్రాలు సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనున్నాయి.
ఈ చిత్రం ఎం. తేజస్వి నందమూరి సమర్పణలో రామ్ అచంట, గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్త మేనన్, ఆది పిన్ని శెట్టి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ రామ్ ప్రసాద్, సంతోష్ డేటాకే చాయాగ్రహకులుగా వ్యవహరిస్తున్నారు.