- Advertisement -
కాంగ్రెస్, బిజెపిపై బిఆర్ఎస్ మాజీ మంత్రి నింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముల్లుకుచ్చుకుంటే.. రాష్ట్ర బిజెపి నేతలకు నొప్పిలేస్తుందని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రాజెక్టులలో జరుగుతున్న నష్టాల మీద రాష్ట్ర బిజెపి నేతలు, ప్రజా ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో నష్టాలపై ఎలాంటి కమిషన్లు వేయదని.. విచారణ కూడా చేయదన్నారు. శ్రీశైలం సొరంగం కూలినా.. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా.. వట్టెం పంప్ హౌస్ మునిగినా.. కేంద్రం ఎందుకు కమిషన్లు పంపడం లేదని మాజీ మంత్రి ప్రశ్నించారు. వాటి మీద విచారణకు రాష్ట్ర బిజెపి నేతలు ఎందుకు డిమాండ్ చేయరని నిరంజన్ రెడ్డి నిలదీశారు.
- Advertisement -