లార్డ్: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్లూటిసి) ట్రోఫీని సౌతాఫ్రికా టీమ్ కైవసం చేసుకుంది. లార్డ్ వేదికగా జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి కప్ను దక్కించుకుంది. 213/2 ఓవర్నైట్ స్కోరుతో శనివారం నాలుగో రోజు బ్యాటింగ్ను చేపట్టిన సౌతాఫ్రికా మరో మూడు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆటను ప్రారంభించిన సఫారీ టీమ్కు ఆరంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ 134 బంతుల్లో ఐదు ఫోర్లతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో ఓవన్నైట్ బ్యాట్స్మన్ ఐడెన్ మార్క్రమ్ అద్భుత బ్యాటింగ్తో జట్టును విజయం దిశగా నడిపించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (8)తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. స్టబ్స్ ఔటైనా మార్క్రమ్ పోరాటం కొనసాగించాడు. డేవిడ్ బహింగ్హామ్తో కలిసి లక్షం వైపు సాగాడు.
ఇద్దరు కుదురుగా ఆడడంతో దక్షిణాఫ్రికా విజయానికి చేరువైంది. కానీ 207 బంతుల్లో 14 ఫోర్లతో 136 పరుగులు చేసిన మార్క్రమ్ను ఆసీస్ బౌలర్ హాజిల్వుడ్ వెనక్కి పట్టాడు. ట్రావిస్ హెడ్ పట్టిన అద్భుత క్యాచ్కు మార్క్రమ్ పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికే సౌతాఫ్రికా ఖరారైంది. ఆరు పరుగుల లాంఛనాన్ని బడింగ్హామ్ 21 (నాటౌట్), కైల్ వెర్రెనె 4 (నాటౌట్) పూర్తి చేశారు. ఈ విజయంతో సౌతాఫ్రికా నయా చరిత్ర సృష్టించింది. తన ఖాతాలో 27 ఏళ్ల తర్వాత ఓ ఐసిసి ట్రోఫీని జత చేసుకుంది. గతంలో దక్షిణాఫ్రికా ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఆ తర్వాత సఫారీ టీమ్ ఓ ఐసిసి ట్రోఫీని గెలుచుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. చారిత్రక బ్యాటింగ్తో సౌతాఫ్రికాకు చిరస్మరణీయం సాధించి పెట్టిన మార్క్రమ్కు ప్లేఆయర్ ఆఫ్ది ఫైనల్ అవార్డు దక్కింది. ఇక బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన
ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా 282 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఛేదించి పెను ప్రకంపనలు సృష్టించింది. ఓపెనర్ మార్క్రమ్ (136), కెప్టెన్ బవుమా (66) చారిత్రక ఇన్నింగ్స్తో సౌతాఫ్రికాను ఆదుకున్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 215, రెండో ఇన్నింగ్స్లో 207 పరుగులు చేసింది. సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్లో 138 పరుగులకే కుప్పకూలింది. కానీ రెండో ఇన్నింగ్స్లో బౌలర్లు అసాధారణ ప్రతిభతో సౌతాఫ్రికాకు మళ్లీ పైచేయి సాధించి పెట్టారు. ఏమాత్రం ఆశలు లేని స్థితి నుంచి దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం.