అహ్మదాబాద్లో జరగిన ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar Anderson Trophy) విషయంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు.. బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకున్నాయి. లార్డ్స్ మైదానం వేదికగా ఈ ట్రోఫీ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. కానీ, విమాన ప్రమాదం నేపథ్యంలో ఈ వేడుకలను వాయిదా వేశారు. కొత్త తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 275 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో జరగాల్సిన టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ (Tendulkar Anderson Trophy) నామకరణం కార్యక్రమాన్ని చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇంతకు ముందు ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్ విజేతకు పటౌడీ ట్రోఫీని ఇచ్చేవారు. ఇటీవల ఆ పేరును రిటైర్ చేసి.. టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ అని ఇవ్వాలని నిర్ణయించారు.
విమాన ప్రమాదం.. టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీపై కీలక నిర్ణయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -