Sunday, June 15, 2025

ఒకే వేదికపై అల్లుఅర్జున్, సిఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ గద్దర్ పిల్మ్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ అవార్డుల వేడుక వేదికపై స్టైలీస్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపించడం ఆసక్తిగా మారింది. ఉత్తమ నటుడిగా అల్లుఅర్జున్ కు గద్దర్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈక్రమంలో వీరిద్దరూ కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప2 సినిమా రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లుఅర్జున్ ను కాంగ్రెస్ ప్రభుత్వం జైలుకు పంపించడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సిఎం రేవంత్ రెడ్డి అల్లుఅర్జున్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా, 14 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ పేరుతో తెలుగు సినీ నటీనటులకు అవార్డులను ప్రకటించింది. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఈ అవార్డుల వేడుక జరుగుతోంది. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ అవార్డుల వేడుకకు సినీ హీరోలు, దర్శకులు, నిర్మాతలతోపాటు సినీ ప్రముఖులంతా హాజరయ్యారు. కాగా టాలీవుడ్ లో ఉత్తమ నటుడిగా మొదటి గద్దర్ అవార్డు అల్లుఅర్జున్ అందుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News