Monday, June 16, 2025

పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాల

- Advertisement -
- Advertisement -

ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం భీకర దాడులు మరో ఇద్దరు ఇరానీ కమాండర్ల హతం ఇరాన్ దాడుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతి డజన్ల సంఖ్యలో క్షతగాత్రులు నివాస ప్రాంతాలపై దాడులు ఆపకపోతే టెహ్రాన్ మండిపోతుందంటూ ఇజ్రాయెల్ హెచ్చరిక
టెహ్రాన్: ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నె లకొన్నాయి. తాజాగా శనివారం ఇజ్రాయెల్ మరోసారి జరిపిన క్షిపణిదాడుల్లో ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయింది. స్థానిక మీడియా ఈ మేరకు వివరాలు తెలియజేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెం దిన సాయుధ దళాల జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారికంగాఎలాంటి ప్రకటనా రాలేదు. కాగా శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అల్‌ఖమేనీ నివాసం సమీపంలోను వైమానిక దాడులు జరిపినట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నా యి. ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో ఇజ్రాయెల్ గురువారం రాత్రినుంచి ఇరాన్‌లోని అణు స్థావరాలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఇరానియన్ రెల్యూషనరీ గార్డ్ కోర్ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి,దేశ క్షిపణి కార్యక్రమఅధిపతి జనరల్ అమీర్ అలీ హాజీ జాదేతో పాటుగా పలువురు అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు. మరో వైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. శనివారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున జరిపిన క్షిపణి దాడుల్లో కనీసం ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందగా డజన్ల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. కాగా గత రెండు రోజులుగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 78 మంది మృతి చెందగా, 320మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం ఇజ్రాయెల్‌పై భారీ సంఖ్యలో డ్రోన్లు, వందల సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది.

ఈ దాడులతో ఇరాన్ రాజధాని టెల్ అవివ్, జెరూసలెం నగరాలపై ఆకాశమంతా మంటల వెలుగులు నిండుకోగా, దిగువన నివాస భవనాలను వణికి పోయాయి. దీంతో ఇప్పటికే గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో భయంతో బిక్కచచ్చిపోయిన పౌరులను గంటలపాటు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవలసిందిగా ఇజ్రాయెల్ మిలిటరీ అభ్యర్థించింది. కాగా శనివారం ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు ప్రాంతాలపై బాబంబుల వర్షం కురిపించింది. అణు, మిలిటరీ స్థావరాలు సహా 200కు పైగా లక్షాలపై బాంబుల వర్షం కురిపించింది. ఇస్ఫహాన్ అణు కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఫోర్డో అణు కేంద్రం పరిమితంగా దెబ్బతిన్నదని ఇరాన్ సైతం ధ్రువీకరించినట్లు ‘ఇర్నా’ వార్తాసంస్థ తెలిపింది.

ఇజ్రాయెల్ అంతర్జాతీయ ఏర్‌పోర్టు మూసివేత
ఇదిలా ఉండగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్న నేపథ్యంలో టెల్ అవివ్ సమీపంలోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తదుపరి ఉత్తర్వుల దాకా మూసి ఉంచుతున్న ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. అయితే లెబనాన్, జోర్డాన్ తదితర గల్ఫ్ దేశాలు మాత్రం శనివారం తమ గగనతలాలను తిరిగి తెరుస్తున్నట్ల్లు ప్రకటించాయి.

ఇరాన్‌లోని భారతీయ ఎంబసీ సూచనలు
ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత దౌత్యకార్యాలయం ఇరాన్‌లోని భారతీయులకు అత్యవసరంగా సంప్రదించేందుకు ఫోన్ నంబర్లతో కూడిన వివరాలను జారీ చేసింది. అంతేకాకుండా అనవసరంగా తిరగొద్దని, సేఫ్టీ ప్రోటోకాల్స్‌ను పాలించాలని సలహా ఇచ్చింది. అత్యవసరమయితే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు + 98 9128 109 115, +98 9128109 109లను ఎంబసీ శుక్రవారం ఎక్స్‌లో ఉంచిన పోస్టులో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News