Monday, June 16, 2025

బడులకు టెక్ బలగం

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ సమక్షంలో ప్రముఖ
ఎన్‌జిఓలతో విద్యాశాఖ ఒప్పందం
5వేల ప్రాథమిక పాఠశాలలకు
విస్తరించనున్న ఏక్‌స్టెప్ ఫౌండేషన్
కృత్రిమ మేధ ఆధారిత ఫ్లాట్‌ఫామ్
పోటీ పరీక్షలకు సన్నద్ధం
చేయనున్న ఫిజిక్స్‌వాలా ఖాన్
అకాడమీ వీడియో ఆధారిత
ఎస్‌టిఇఎం శిక్షణ బాల సురక్ష,
రక్షణ కార్యక్రమాలు చేపట్టనున్న
ప్రజ్వల ఫౌండేషన్ కోడింగ్,
కంప్యూటేషనల్‌లో శిక్షణ
ఇవ్వనున్న ‘పైజామ్’
16 వేలకు పైగా పిల్లలను
తిరిగి బడిలో చేర్పించే బాధ్యత
తీసుకోనున్న ఎడ్యుకేట్ గర్ల్

ఆరు సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ స్కూళ్లలో అధునాతన ఎడ్‌టెక్ సదుపాయాలు

మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్‌జిఒ సంస్థలతో రాష్ట్ర వి ద్యాశాఖ అవగాహన ఒప్పందా(ఎంఒయు)లు కు దుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితం గా అందించాలన్న లక్ష్యంతో ఎంఒయు కుదుర్చుకున్నట్టు విద్యాశాఖ తెలిపింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్ టెక్ సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందుకు నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్ పాండే ఆధ్వర్యంలో ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షో యబ్‌దార్ నిర్వహిస్తోన్న పైజామ్ ఫౌండేషన్, స ఫీనా హుస్సేన్ ఆధ్వర్యంలోనే ఎడ్యుకేట్ గర్ల్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యాశాఖ ఎంఒ యు కుదుర్చుకున్నది.

సిఎం రేవంత్‌రెడ్డి సమక్షం లో ఆదివారం విద్యాశాఖ ఈ ఒప్పందాలు కుదు ర్చుకుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదా రు కే.కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సిఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, విద్యాశాఖ స్పెషల్ సెక్రెటరీ హరిత, ఏక్ స్టెప్ ఫౌండేషన్ సి ఇఒ జగదీష్ బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డా.సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇం డియా ఎండీ స్వా తి వాసుదేవన్, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్ దార్, ఎడ్యుకేట్ గర్ల్ సిఇ ఒ గాయత్రి నాయిర్ లోబో తదితరులు పాల్గొన్నా రు.

రాష్ట్రంలో విద్యా నాణ్యతా ప్రమాణాలను మె రుగుపరచాలన్న సిఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుం ది. ప్రజాప్రభు త్వం అమలు చేస్తోన్న కార్యక్రమా లు, పథకాలకు ఆకర్షితులై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయని ప్రభు త్వం తెలిపింది. నందన్ నీలేకని నేతృత్వంలో ఏక్ స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేధ ఆధారిత ఫ్లాట్‌ఫామ్‌తో 540 పాఠశాలల్లో పనిచేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ భాషలతో పాటు మ్యాథ్స్ బేసిక్స్‌ను ఈ సంస్థ అందిస్తుంది.

అలాగే ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జెఇఇ, క్లాట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత ఎస్‌టిఇఎం(సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలో ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. పై జామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్‌పై శిక్షణను అందిస్తుంది. ఎడ్యుకేట్ గర్ల్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News