- Advertisement -
సైప్రస్ కు భారత్ అత్యంత విశ్వనీయ దేశమని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ తెలిపారు. మన పర్యాటకులకు సైప్రస్ మంచి ప్రదేశం అని అన్నారు. సైప్రస్ దేశం నుంచి ప్రధాని మీడియాతో మాట్లాడుతూ..సైప్రస్ కు యూరోపియన్ యూనియన్ అధ్యక్ష పదవి (Union President) అవకాశం రావడంపై భారత్ తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. సైప్రస్ నాయకత్వంలో యూరోపియన్ మరింత మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని, భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కోసం సైప్రస్ యూరోపియన్ యూనియన్ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నామన్నారు. సైప్రస్ పర్యటన సరికొత్త అధ్యాయం లిఖించేందుకు సువర్ణావకాశం అని మోడీ చెప్పారు. ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన ద్వైపాక్షిక సంబంధాలకు పునాది అని భారత్- సైప్రస్ సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకుంటాయని మోడీ పేర్కొన్నారు.
- Advertisement -