ప్రయాణికురాలిపై ఓ రాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ చేయిచేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మూడు రోజుల క్రితం బెంగళూరు లోని జయనగర్ ప్రాంతం లోని ఓ ఫుట్వేర్ షోరూం ముందు జరిగిన ఈ సంఘటన తాజాగా వెలుగు లోకి చ్చింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు నగరం లోని ఓ నగల దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతి షాప్కు వెళ్లడానికి ర్యాపిడో బైక్ టాక్సీని బుక్ చేసుకుంది. రైడర్ ఆమెను షార్ట్కట్లో తన షోరూం దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే రైడర్ బైక్ను నిర్లక్షంగా,
వేగంగా నడుపుతున్నాడని ఆమె భయాందోళనలకు గురై మధ్యలోనే ఆపేసి బైక్ దిగిపోయింది. రైడర్ డ్రైవింగ్ తీరుపై నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. యువతికి కన్నడ, ర్యాపిడో డ్రైవర్కు ఇంగ్లీష్ రాకపోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఛార్జీ డబ్బులతో పాటు హెల్మెట్ తిరిగి ఇవ్వాలని ర్యాపిడో డ్రైవర్ గట్టిగా అడిగాడు. దానికి యువతి నిరాకరించింది. దీంతో రైడర్ ఆమెను గట్టిగా కొట్టగా ఆమె కింద పడిపోయింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.