Tuesday, June 17, 2025

కన్నతండ్రిని కొట్టి చంపిన కూతురు

- Advertisement -
- Advertisement -

కన్నతండ్రిని స్వంత కుమార్తె రోకలి బండతో కొట్టి చంపిన విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం, ధర్మారం గ్రామంలో చోటుచేసుకుంది. గామానికి చెందిన పల్లపు నరసయ్య (54) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తుండగా అతని కుమార్తె రోకలి బండతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న నవీపేట్ ఎస్‌ఐ వినయ్ గ్రామానికి చేరుకొని ఈ సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News