Tuesday, June 17, 2025

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో మొత్తం 2,49,358 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 1,68,079 మంది(67.4 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 1,35,107 మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో 68,665 మంది (50.82 శాతం )విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం https://tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైన వారిలో పరీక్షల్లో ఫెయిలైన వారితో పాటు ఫస్టియర్‌లో ఇంప్రూవ్‌మెంట్ కోసం రాసిన విద్యార్థులూ ఉన్నారు. రీ వ్యాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 23వ తేదీలోగా ఫీజు చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలని తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు నిర్వహించగా, ఈ పరీక్షలకు మొత్తం 4,13,880 మంది విద్యార్థులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News