Wednesday, June 18, 2025

ఇజ్రాయెల్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడి

- Advertisement -
- Advertisement -

స్వల్పంగా దెబ్బతిన్న టెల్ అవీవ్‌లోని దౌత్య కార్యాలయం ఇరాన్‌పై
భీకరస్థాయిలో ఇజ్రాయెల్ దాడులు అణుకేంద్రాలు, చమురు క్షేత్రాలే
టార్గెట్ బంకర్‌లో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం ఖమేనీ ఎన్‌పిటి
నుంచి వైదొలుగుతామని ఇరాన్ ప్రకటన మాపై ఇజ్రాయెల్ అణుదాడి
చేస్తే పాక్ ప్రతీకార దాడి చేస్తుందన్న ఇరాన్ నేతలు ఖండించిన పాకిస్తాన్
టెహ్రాన్ నుంచి ఖోమ్ నగరానికి భారతీయ విద్యార్థుల తరలింపు

టెల్ అవీవ్: ఇరాన్‌లోని అత్యంత కీలక స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు సాగుతున్నాయి. టెహ్రాన్ అగ్నిగుండంగా మారింది. సోమవారం కూడా ఇరాన్‌లోని అణు కేంద్రాలు, చమురు క్షేత్రాలను లక్షంగా చేసుకుని తాము క్షిపణి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్ సైన్యం (ఐడిఎఫ్) ప్రకటించింది. ఇరాన్ లోని సైనిక కేంద్రాలు, అణు కేంద్రాలు లక్షంగా చేసుకుని దాడులు సాగిస్తామని , దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతాలలో ఉండే పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఇజ్రాయెల్ ముందస్తు హెచ్చరికలు వెలువరించింది. ఇప్పటికే 210 ప్రాంతాలను ఎంచుకుని దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రతిఘటన నామమాత్రంగానే ఉన్నట్లు అధికారికంగా తెలిపారు ఇక దాడులతో ఇరాన్ అగ్రశ్రేణి నాయకత్వంలో కలవరం చెలరేగింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆగకుండా భీకర రీతిలో టెహ్రాన్, ఇతర ప్రాంతాల్లో ఇజ్రాయెల్ క్షిపణి దాడులు సాగుతున్నాయి. ఈ పరిణామంతో భద్రత అధికారుల హెచ్చరికలతో ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా ఖమేనీని అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు.

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలతో కంచుకోటగా ఉండే ఓ ప్రాంతంలోని ఓ రహస్య బంకర్‌లోకి ఆయనను తరలించారు. ఖమేనీ ఇప్పుడు కుటుంబంతో పాటు ఈశాన్య టెహ్రాన్‌లోని బంకర్‌లో తలదాచుకుంటున్నట్లు వెల్లడైంది. ఖమేనీ ఇతర అగ్రనేతలు లక్షంగా ఇజ్రాయెల్ సేనలు అర్థరాత్రి తరువాత వారి నివాసాలపై దాడులకు దిగాయి. ఇవి రాత్రి అంతా కొనసాగాయి. ఈలోగానే అగ్రనేతలు రహస్య మార్గాల ద్వా రా బంకర్లలోకి వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపా యి. ఇరాన్ అధ్యక్షుడు నివాసం ఉండే మోనిరియో ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు జరిగాయి. దీనితో ఇక్కడ భయానక పరిస్థితి నెలకొంది. తమ వేగు సంస్థల కీలక సమాచారంతో ఇరాన్‌కు భారీ నష్టం కల్గించేలా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది.

ఈ క్రమంలోనే ఇరాన్‌కు చెందిన ప్రముఖ అణుశాస్త్రవేత్తలు, సైనిక ఉన్నతాధికారులు ప్రాణాలు పొయ్యాయి. మరో వైపు తమ ఆపరేషన్ రైజింగ్‌లో భాగంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడులలో పౌర నివాసిత ప్రాంతాలు కూడా ధ్వంసం అయ్యాయి. టెహ్రాన్ ఇతర ప్రధాన నగరాలు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న పలు భవనాలతో ఉంది. ఇజ్రాయెల్ దాడులలో ఇప్పటికే ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు మహమ్మద్ బాఘేరి, రెవల్యూషనరీ గార్డ్ అధిపతి మేజర్ జనరల్ హుస్సెన్ ఫలామీ, ఇంటలిజెన్స్ చీఫ్ కూడా బలి అయ్యారు. ఇజ్రాయెల్ తమ దాడుల తొలిదశలోనే ఖమేనీని అంతమొందించాలని నిర్ణయించింది. దీనికి ట్రంప్ అంగీకరించలేదు. అణు కార్యక్రమాల నిలిపివేతకు ఇరాన్‌కు ఓసారి చివరి అవకాశం ఇవ్వాలని అత్యంత పకడ్బందీగా ఖమేనీ నివాసం పరిసరాల్లో దాడులు సాగించారు.

అయితే ఈ దాడులకు ముందే ఖమేనీ తమ పరివారంతో రహస్య కందకానికి తరలివెళ్లినట్లు తెలిసింది. కాగా ఇరాన్ సోమవారం తెల్లవారుజామున ఎదురుదాడులకు దిగింది. ఈ క్షిపణిదాడులలో ఐదుగురు చనిపోయారు. గగనతల దాడులలో తమదే ఆధిక్యత అని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ జరిపిన దాడులలో టెల్ అవీవ్‌లోని అమెరికా ఎంబసీ సమీపం లో క్షిపణి వచ్చి పడింది. ఈ ఘటనలో భవనానికి కొంత మేర పగుళ్లు ఏర్పడ్డాయి,. ఎటువంటి ప్రాణనష్టం కలుగలేదని అమెరికా రాయబారి మైక్ హకబీ తెలిపారు.ఇరాన్ అధికారిక టీవీ స్టూడియో ధ్వంసం
ఇజ్రాయెల్ క్షిపణి దాడులలో టెహ్రాన్‌లోని ఇరాన్‌కు చెందిన అధికారిక టీవీ వార్తా సంస్థ కార్యాలయం దెబ్బతింది. కార్యాలయంలోపల ప్రసారాలు సాగుతున్నప్పుడే కాంపౌండ్‌లో క్షిపణి వచ్చి పడింది. వార్తలు విశ్లేసిస్తున్న యాంకర్ సహర్ ఇమామీ లేచి బయటకు పరుగులు తీశారు. సిబ్బంది కూడా భయభ్రాంతులు చెంది, పరుగులు తీసింది. ప్రత్యక్ష ప్రసారంలో నేపథ్యంలో అల్లా హో అక్బర్ అంటూ నినాదాలు వినబడ్డాయి. లేడీ యాంకర్ ప్రాణభయంతో బయటకు వచ్చారు.

అణు కట్టడికి ఇరాన్ చెల్లుచీటి?
ఇజ్రాయెల్ భీకర దాడులకు స్పందనగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రపంచ స్థాయి అణు కట్టుబాట్ల ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగనుంది. ప్రపంచంలో ఏ దేశం కూడా అణుయుద్ధానికి దిగకుండా చేసేందుకు కట్టడిగా ఉండేందుకు గతంలో అణువ్యాప్తి నిరోధక ఒడంబడిక (ఎన్‌పిటి) కుదిరింది. సంబంధిత కట్టుబాట్లకు పలు దేశాలు సమ్మతి తెలిపాయి. సంతకాలు చేశాయి. అయితే తమ దేశపు అణు కేంద్రాలను టార్గెట్‌గా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు సాగించడం , తమ దేశపు అణుశాస్త్రవేత్తలు కొందరు దుర్మరణం చెందడంతో ఇక ఎన్‌పిటి కట్టుబాట్లతో తమకు అవసరం లేదని ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌పిటి నుంచి వైదొలిగే ముసాయిదా తీర్మానం రూపొందిస్తున్నారు. దీనిని పార్లమెంట్‌లో ఆమోదింపచేసిన తరువాత అధికారికంగా ఈ ఒడంబడిక నుంచి వైదొలుగుతారని ఇరాన్ అధికార వర్గాలు ఈ వార్తను ధృవీకరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News