స్థానిక సమరానికి క్యాడర్ను
సన్నద్ధం చేయాలి జిల్లాల
ఇన్ఛార్జి మంత్రులు స్థానిక
నేతలతో సమన్వయం
చేసుకోవాలి మంత్రులతో
జరిగిన సమావేశంలో
సిఎం రేవంత్ ఏది పడితే
అది మాట్లాడి వివాదాస్పదం
కావొద్దు మంత్రులకు
ముఖ్యమంత్రి సూచన
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సిఎం రేవంత్రెడ్డి మంత్రులను ఆదేశించినట్టుగా తెలిసింది. స్థానిక సంస్థలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో కేడర్ను ఆ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని ఆయన మంత్రులతో పేర్కొన్నట్టుగా సమాచారం. మంత్రులు, జిల్లాల ఇంచార్జ్లు, ఎంపిలు, ఎమ్మెల్యేలు కేడర్ను సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించినట్టుగా తెలిసింది. రైతుల అకౌంట్లలో రైతు భరోసా జమ కాగానే ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించినట్టు సమాచారం. దీంతోపాటు మంత్రులు ఏదీ పడితే అది మాట్లాడవద్దని, వివాదాస్పదం కావొద్దని సిఎం రేవంత్ మంత్రులకు సూచించినట్టుగా తెలిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సిఎం రేవంత్రెడ్డి, మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అం శాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా వంటి అంశాలపై చర్చించినట్టుగా సమాచారం.