కేంద్రఫికేషన జారీహోంశాఖనోటి
రెండు విడతల్లో గణన
డిజిటల్ రూపంలోనే
సేకరణ 34లక్షల
మంది గణకులు
న్యూఢిల్లీ : దేశంలో 15 ఏళ్ల తర్వాత చేపట్టబోయే జనగణనకు సంబంధించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతోజనాభా లెక్కింపు ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైనట్టయింది. మొత్తం రెండు దశల్లో జనాభాను లెక్కించనున్నా రు. 2027 మార్చి 1 వ తేదీ నాటికి జనగణన పూర్తి కానుంది. మంచు ఎక్కువగా ఉండే “ కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ముకశ్మీర్, లద్దాఖ్తో సహా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబరు 1 అర్ధరాత్రి వరకు జనగణనను నమోదు చేయనున్నాం . ఇవి కాకుండా దేశ వ్యాప్తంగా మిగతా ప్రాంతాలన్నింటిలో 2027 మార్చి 1 నాటికి జనాభా లెక్కను పూర్తి చేయనున్నాం ” అని హోం మంత్రిత్వశాఖ ఆ నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇది మొత్తంగా 16 వ, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8 వ జనగణన.
ఈసారి జనగణనతోపాటు కుల గణననూ చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపం లోనే సాగుతుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్ల్లో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదు చేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్టు తెలిపింది. సాధారణంగా పదేళ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరిసారి 2011లో దీన్ని చేపట్టారు. 2021 జనాభా లెక్కలకు సంబంధించి 2020 లోనే ఈ ప్రక్రియ చేపట్టాల్సింది. కానీ కొవిడ్ కారణంగా వాయిదా పడింది.