- Advertisement -
భీమిలి: గత నెలలో అదృశ్యమైన యువతి జీడి తోటలో ఉరేసుకున్న సంఘటన విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్ వద్ద జరిగింది. భీమిలి ప్రాంతం కృష్ణా కాలనీకి చెందిన బంగారి కవిత(24) అనే యువతి గత నెలలో కనిపించకుండా పోయింది. భీమిలి పోలీస్ స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భీమిలి బీచ్కు సమీపంలోని జీడి తోటలో చెట్టుకు ఉరేసుకున్నది సదరు యువతేనని గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టమ్ నిమిత్తం భీమిలి ఆస్పత్రికి తరలించారు. యువతి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా చంపేసి ఉరేశారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
- Advertisement -