Wednesday, June 18, 2025

భారీగా తగ్గిన పసిడి ధరలు..

- Advertisement -
- Advertisement -

ఇరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో బంగారం పై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బంగారం వైపు ఇన్వెస్టర్లు చూస్తున్నారు. ఈ కారణంగానే బంగారం ధర మళ్లీ లక్ష మార్కు దాటేసింది. రెండు నెలల క్రితం లక్ష మార్కు దాటిన బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ లక్ష దాటింది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. పసిడి ప్రియులు బంగారం కొనడానికి అసలు వెనకాడరు. ఎంత ధర ఉన్న కొనుగోలు చేస్తారు. బులియన్ మార్కెట్లో బంగారం, వెండికి ఎల్లప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే బంగారం ధరలు ఒక రోజు పెరుగుతే, మరుసటి రోజు తగ్గుతాయి. ఈరోజు పసిడి ధరలు కాస్త తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,500 గా ఉండగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,040గా పలుకుతోంది. దాదాపు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్
24 క్యారెట్ల బంగారం ధర రూ.101,500
22 క్యారెట్ల ధర రూ.93,050 లుగా ఉంది.

విజయవాడ
24 క్యారెట్ల పసిడి ధర రూ.101,500
22 క్యారెట్ల పసిడి ధర రూ.93,050

విశాఖపట్నం
24 క్యారెట్ల పసిడి ధర రూ.101,500
22 క్యారెట్ల పసిడి ధర రూ.93,050

వరంగల్
24 క్యారెట్ల పసిడి ధర రూ.101,500
22 క్యారెట్ల పసిడి ధర రూ.93,050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News