డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో తెరకెక్కిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ ఊహించినంత సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఆయన మళ్లీ సక్సెస్ సాధించి.. తిరిగి వింటేజ్ పూరి అని అనిపించుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తమిళ స్టార్ విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా #PuriSethupathi సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది ఎవరో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన సంయుక్త ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి చిత్ర యూనిట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ‘ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం..’ అంటూ సంయుక్తకు చిత్ర యూనిట్ వెల్కమ్ చెప్పింది. ఇక ఈ సినిమాలో సీనియర్ నటి టబు, దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్పై పూరి జగన్నాథ్, ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘బెగ్గర్’ లేదా ‘బిక్షాందేహి’ అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.