- Advertisement -
అమరావతి: గోదావరి వరదల వల్ల ఎపికే ఎక్కువ నష్టం అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పర్యావరణ అనుమతుల కోసమే కేంద్రానికి లేఖ రాశాం అని అన్నారు. ఈ సందర్భంగా నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోతున్న ఎపికి.. నీళ్లు ఉపయోగించుకునే హక్కుఉంది అని చెప్పారు. గోదావరి నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని, ఎగువ నీటి అవసరాలు తీరిన తర్వాతే బనకచర్లకు నీళ్లు (Banakacharla water) వృథాగా పోతున్నాయని ఆ నీళ్లనే బనకచర్లకు వాడుకుంటాం అని తెలియజేశారు. రాజకీయ లబ్ధి కోసమే బనకచర్లపై వైసిపి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు. ప్రాజెక్టుతో ఎగువ రాష్ట్రాలకు నష్టం లేదని అన్నారు. బనకచర్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ప్రాజెక్టుపై అనుమానాలు అవసరం లేదు అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
- Advertisement -