Wednesday, June 18, 2025

మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మూడు ఎకరాల వరకు రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రెండో రోజు రూ.1551.89 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశామని ప్రకటించింది. మంగళవారం 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున రైతుభరోసా నిధుల జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతుభరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ రైతుభరోసా ఇస్తామన్నారు.  రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతుభరోసా జమ చేయడంతో పాటు రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News