Wednesday, June 18, 2025

నితిన్ ‘తమ్ముడు’ నుంచి తొలి సాంగ్ వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

వరుస ప్లాపులతో సతమతమవుతున్న నితిన్.. ఈసారి హిట్ కోసం ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ శ్రీరామ్ వేణుతో జతకట్టాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘తమ్ముడు‘. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఆసక్తికరంగా రూపొందించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. మంగళవారం హైదరాబాద్ లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ‘భూ అంటే భూతం వస్తే..’ అంటూ సాగే ఈ పాటను కొద్దిసేపటిక్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, అక్షిత పోల అలపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ, వర్ష బొల్లమ్మ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, జూలై 4న ‘తమ్ముడు’ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News