- Advertisement -
ఆర్టిసి బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిని టార్గెట్గా చేసుకుని చైన్స్నాచింగ్ చేస్తున్న ముగ్గురు నిందితులను టోలీచౌకి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.50లక్షల విలువైన బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…గనిపినేని బాబు ఈ నెల 14వ తేదీన బస్సులో ప్రయాణిస్తుండగా టోలీచౌకి ఎక్స్ రోడ్డు, అర్బాబ్ రేయాన్ హోటల్ వద్ద అతడి మెడలోని 1.4తులాల బంగారు చైన్ను కొట్టేశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి బండారి కేశవ్ అలియాస్ చిన్నా, కాంబ్లే శ్యాం సుందర్ అలియాస్ శ్రీను, ఉపాడే సూరజ్, వంశీ, వంశీవర్దన్ కలిసి చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. వంశీ, వంశీవర్దన్ పరారీలో ఉండగా మిగతా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్స్పెక్టర్ రమేష్ నాయక్, డిఐ బాలరాజు, ఎస్సై రాఘవేంద్ర తదితరులు పట్టుకున్నారు.
- Advertisement -