- Advertisement -
హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసులో సెల్ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలని ఎసిబి ఇచ్చిన ఆర్డర్స్ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. ఎసిబి ఆదేశాలపై తన న్యాయవాదుల బృందంతో చెర్చిన కెటిఆర్.. బలవంతంగా వ్యక్తిగత సెల్ఫోన్లు తీసుకోకూడదని సుప్రీం ఆదేశాలు ఉన్నాయన్నారు. సెల్ఫోన్, ల్యాప్టాప్ ఇవ్వాల్సిన అవసరం లేదని కెటిఆర్ లాయర్ల బృందం తెలిపారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. “ఫోన్లు, వ్యక్తిగత పరికరాలు చూపించమని పోలీసులు బలవంతం చేయకూడదు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు యాక్సెస్ చేయొద్దని ఈడీ కేసులో తీర్పు ఉంది. ఆర్టికల్ 20/3 ప్రకారం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు, గోప్యత ఇందులో భాగమే” అని కెటిఆర్ పేర్కొన్నారు.
- Advertisement -