సచివాలయంలో ఎంపిల సమావేశం హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రమంత్రులు కిషన్రెడ్డి,
బండి సంజయ్లకూ ఆహ్వానం అన్ని పార్టీల లోక్సభ, రాజ్యసభ సభ్యులకు మంత్రి ఉత్తమ్ లేఖలు బనకచర్లను
వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను జత చేసిన మంత్రి పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తలపెట్టిన గోదావరి- బనకచర్ల లింక్ ప్రా జె క్టు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ని ర్ణ యం తీసుకుంది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఏ ర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టుపై అన్ని పార్టీల లోక్ సభ, రాజ్యసభ సభ్యులకు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో నే డు సాయంత్రం 4 గంటలకు నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బనకచర్లపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ (పిపిటీ) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్రెడ్డి సైతం ముఖ్య అతిథిగా పాల్గొననుండగా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు బిజెపి, బిఆర్ఎస్, ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను కూడా రాష్ట్ర ప్ర భుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వారికి ఆహ్వాన లేఖలను పంపించారు.గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుందని,అందులో భాగంగా 22 జనవరి 2025 న కేంద్ర ఆర్థిక, జల్శక్తి మంత్రులకు రాసిన లేఖలను సైతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీలకు ఆహ్వాన పత్రికతో పాటు ఈ లేఖలను సై తం పంపించారు.
ఈ ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలను తెలుపుతూ జూన్ 3న సిఎం రేవంత్ రెడ్డి తో కలిసి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి వి షయాన్ని వివరించినట్టుగా ఆ లేఖలో మంత్రి ఉ త్తమ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని అంశాల ను దృష్టిలో ఉంచుకొని తదుపరి చర్యలు తీసుకునేందుకు నేడు ఈ పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ని ర్వహించబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ ఆహ్వాన లేఖ లో తెలిపారు. ఎపి ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ వద్దకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపిందని, ప్రాథమిక అధ్యయనంలో, ఈ ప్రాజెక్ట్ 1980 నాటి గోదావరి జల వివాద ట్రి బ్యునల్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించినట్లు కనిపిస్తోందని మంత్రి ఉత్తమ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ ఏడాది జనవరి 22వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల నీటి హక్కులను హరించేలా ఉందని ఆ లేఖలో మంత్రి పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర జల్శక్తి శాఖ తమకు ఎపి నుంచి ఎలాంటి డిపిఆర్ అందలేదని పేర్కొంది. ఆ తర్వాత కూడా పలుమార్లు మంత్రి ఉత్తమ్ కేంద్రానికి లేఖలు రాశారు. ఎపి జలశక్తి శాఖకు ప్రతిపాదనలు పంపినందున దీనిని అడ్డుకునేందుకు ఎలా ముందుకెళ్లాలన్న విషయం చర్చించేందుకు రావాలని అన్ని పార్టీలకు మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేయడంతో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నీటిని తరలించే హక్కు మాకూ ఉంది: ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు
తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అప్పుడు, ఇప్పుడు సిఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఎపి సచివాలయంలో మంగళవారం ఆయన బనకచర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో తగిన మదింపు లేకుండా ఎగువన ప్రాజెక్టులు కడితే నష్టపోయేది ఎపి రైతులేనన్నారు. దిగువ పరీవాహక ప్రాంతాల ప్రత్యేక హక్కులు గురించి మాత్రమే చంద్రబాబు మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. అంతే తప్ప తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలనే ప్రయత్నం కాదన్నారు. గతంలో సీతమ్మ బ్యారేజీ, సీతారాం సాగర్ లిఫ్టును కూడా తాము వ్యతిరేకించ లేదన్నారు. గోదావరి నుంచి ఇతర రివర్ బేసిన్లకు నీటిని తరలించే హక్కు చట్టం ప్రకారం తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ చట్టం ప్రకారమే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని, ఎపిలోనూ తాము బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.