- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. సెంట్రల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మహిళా కీలకనేత చలపతి భార్య అరుణ, మరొకరు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఎకె 47 రైఫిల్స్, మందుగుండు సామాగ్రి, సాహిత పుస్తుకాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అరుణపై రూ.10 లక్షల రివార్డ్ ఉంది.
.
- Advertisement -