Thursday, June 19, 2025

పెళ్లి చేసుకుంటానని లవర్ ను గోవా తీసుకెళ్లి..

- Advertisement -
- Advertisement -

గోవాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 22 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో సదరు యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం గుర్తించారు. ప్రియురాలిని పెళ్లి చేసుకుంటానని గోవా తీసుకొచ్చి.. ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడనే ఆరోపణలతో ప్రియుడిని దక్షిణ గోవా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కర్ణాటకలోని ఉత్తర బెంగళూరు నివాసి సంజయ్ కెవిన్ గా, బాధితురాలిని అదే ప్రాంతానికి చెందిన రోష్ని మోసెస్ గా పోలీససులు గుర్తించారు.

“ఈ జంట వివాహం చేసుకోవడానికి ఇటీవల బెంగళూరు నుండి గోవాకు వచ్చారు. కానీ ఏదో తెలియని కారణంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. రెండు రోజుల క్రితం సంజయ్ రోష్నిని చంపి మృతదేహాన్ని అడవిలో పారేశాడు. తర్వాత తిరగి బెంగళూరు పారిపోయాడు” అని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతంలో రోష్ని మృతదేహం గుర్తించడంతో ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెను గొంతు కోసి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

మృతదేహం గుర్తించిన తర్వాత సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసు సూపరింటెండెంట్ (దక్షిణ గోవా) తికం సింగ్ వర్మ మాట్లాడుతూ.. “ప్రేమ వ్యవహారం, వివాహ ప్రతిపాదన నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన వివాదం తర్వాత ఈ హత్య జరిగింది” అని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన గోవా పోలీసులు.. ఆధారాలు సేకరించి, నేరం వెలుగులోకి వచ్చిన 24 గంటల్లోనే బెంగళూరులో సంజయ్ ని అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News