Friday, June 20, 2025

హిందీలో ‘పుష్ప-2’ తగ్గేదే లే.. ఏకంగా ఐపిఎల్‌ను దాటేసింది..

- Advertisement -
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ‘పుష్ప-2’ (Pushpa 2) బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గత ఏడాది థియేటర్‌లో విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఓటిటిలో కూడా కొన్ని వారాల పాటు టాప్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. తొలుత థియేటర్‌లో, ఆ తర్వాత ఓటిటిలో దుమ్ముదులిపేసిన ఈ సినిమా ఇప్పుడు బుల్లితెరపై రికార్డు సృష్టించింది.

ఈ పుష్ప-2 (Pushpa 2) హిందీ వెర్షన్ ఇటీవలే టివిలో టెలికాస్ట్ చేయగా.. ఏకంగా 5.1 టిఆర్‌పి వచ్చిందట. ఇది ఐపిఎల్ యావరేజ్ టిఆర్‌పి కంటే ఎక్కువ కావడం విశేషం. అంతేకాదు.. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘స్త్రీ-2’ సహా పలు హిందీ సినిమాల టిఆర్‌పిని ఇది దాటేసిందని తెలుస్తోంది. అలాగే 5.4 కోట్ల హిందీ జనాలు ఈ సినిమాను చూసినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాక.. జూన్ 29వ తేదీన ఈ సినిమా రీలోడెడ్ హిందీ వెర్షన్‌ని టివిలో ప్రసారం చేస్తున్నారు. మరి ఈసారి ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో అని పుష్ప ఫ్యాన్ అనుకుంటున్నారు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌ నటిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆమెను ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తూ ఓ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీపికాతో పాటు జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్‌లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రమని దర్శకుడు అట్లీ కొన్నిరోజుల క్రితం చెప్పుకొచ్చాడు. హాలీవుడ్‌లో ఓ స్టూడియో ఈ చిత్రం కోసం పని చేస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సూపర్ హీరోగా కనిపించనున్నారని టాక్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News