Thursday, June 19, 2025

మారేడుమిల్లిలో ఎన్‌కౌంటర్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మా వోయిస్టులకు మరో ఎదురు దెబ్బ త గిలింది.ఎపిలోని అల్లూరి సీతారామ రాజు జిల్లా, రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవా రం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ గణేష్ అ లియాస్ ఉదయ్, ఏవోబి స్పెషల్ జో న్ కమిటీ సభ్యుడు చలపతి భార్య అ రుణ మృతి చెందారు. వీరితో పాటు దళ సభ్యుడు అంజు మృతి చెందా రు. గతంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల అజెండా తయా రు చేయడంలో గణేశ్ కీలక పాత్ర పోషించారు.  ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన గణేశ్, అరుణ పై 20 లక్షల రివార్డు ఉంది. చింతకూరు, కొయ్యల గూడెం, కొండ తదితర అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు కీలక నేతలు సంచరిస్తున్నారన్న

సమాచారం తో జిల్లా పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు మంగళవారం రాత్రి నుంచే కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున మావోయిస్టుల కదలికలను పోలీసులు పసిగట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చెందినట్టు పోలీసులు ప్రకటించారు. ఈ కాల్పుల్లో పోలీసులు కూడా గాయపడినట్టు వారు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మూడు ఏకే-47తుపాకులు, మందు గుండు సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఒకవైపు ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపి వేయాలంటూ పౌర సమాజం కోరుతున్న సమయంలో వరుస ఎన్‌కౌంటర్లు జరగడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News