Thursday, June 19, 2025

వాసాలమర్రిలో అర్హులందరికీ ఇండ్లు

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ దత్తత గ్రామంలో నేడు
మంజూరు పత్రాల పంపిణీ
మంత్రి పొంగులేటి వెల్లడి
ఎర్రవెల్లి ఫాంహౌస్ కోసం
వాసాలమర్రిలో ఇండ్లు కూల్చేశారని
వ్యాఖ్య ఇండ్లు కోల్పోయిన
వారందరికీ ఇప్పుడు ఇందిరమ్మ
ఇండ్లు ఇస్తామని ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్:భువనగిరిజిల్లా వాసాలమర్రి గ్రామంలో ఇళ్ల నిర్మాణం పేరుతో మాజీ సిఎం కెసిఆర్ చేతిలో మోస పోయిన ప్ర జలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుం దని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం మంత్రి ఓ ప్రకటనను విడుదల చేశారు. వాసా లమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు 20 20 నవంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రి హోదా లో కెసిఆర్ ప్రకటించినట్లు మంత్రి గుర్తు చేశా రు. 2021 జూన్ 22వ తేదీన గ్రామసభ నిర్వ హించి స్థానికులతో సహపంక్తి భోజనం చేశా రని, బంగారు వాసాలమర్రిగా అభివృద్ధి చేసి, ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇస్తానని కెసిఆర్ హమీ ఇచ్చారన్నారు. కానీ, వాస్తవంగా ఆరోజు నుంచి ముఖ్యమంత్రి పదవి దిగిపోయే వరకు కెసిఆర్ వాసాలమర్రి వైపు కన్నెత్తి చూడలేదన్నారు. ఫాంహౌస్‌కు వెళ్లడానికి రోడ్డు విస్తరణ కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్లను కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేశారని
పొంగులేటి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ఇళ్లు కోల్పోయిన బాధితులు తాత్కాలికంగా గుడిసెలు, టెంట్లు వేసుకొని కాలం వెళ్లదీస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు వాసాలమర్రి దేవుడెరుగు ఉన్న ఇళ్లను కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి పొంగులేటి మండిపడ్డారు. వాసాల మర్రిలో అర్హులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు ఇవ్వబోతుందని, ఇప్పటికే అర్హులను గుర్తించామని ఆయన తెలిపారు. అర్హులైన 205 మందికి ఈ ఇళ్లను మంజూరు చేశామని, దీనికి సంబంధించిన మంజూరు పత్రాలను గురువారం స్వయంగా తాను అందచేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశానికి దశ దిశ చూపిస్తానని ప్రగల్భాలు పలికిన కెసీఆర్ దత్తత గ్రామ ప్రజలకు పంగనామాలు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. కొత్త ఇల్లు రాలేదు, ఉన్న ఇల్లు పోయిందని, ప్రజల అవసరాలను, ఆశలను వారి రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుకున్నారని చెప్పడానికి వాసాలమర్రి గ్రామమే ఒక నిదర్శనమని మంత్రి పునరుద్ఘాటించారు.

నేడు క్షేత్రస్థాయిలో పర్యటన
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం, సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని విభలాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News