- Advertisement -
ఖమ్మం జిల్లా గంగారం మండలంలోని కాటినాగారం గ్రామానికి చెందిన నరేశ్ యశోదల కూతురు మూతి శ్రావణి(12) తన స్నేహితులతో కలిసి కోమట్లగూడెం పెద్ద చెరువులోకి ఈతకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోవడంతో తన తోటి స్నేహితులు, గ్రామస్థులకు తెలియజేశారు. వెంటనే సంఘటన స్థలానికి గ్రామస్థులు వెళ్లి చెరువులో మునిగిన శ్రావణి బయటకి తీసి అంబులెన్స్లో తరలించగా మార్గ మధ్యలో మృతి చెందింది. కాటినాగారం గ్రామ స్థులలకు తెలియడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తెల్లారితే పాఠశాలకు వెళ్లాల్సిన విద్యార్థిని శ్రావణికి ఇలా జరిగిందని తెలియడంతో గ్రామస్థులంతా షాక్కు గురయ్యారు.
- Advertisement -