Thursday, June 19, 2025

అజెండా 5ను ఎందుకు దాచారు?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : బోడిగుండుకు మోకాలుకు లంకె పెట్టి మాట్లాడటంలో రేవంత్ రెడ్డి సిద్దహస్తుడు అని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు పేర్కొన్నా రు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కెసిఆర్ చెప్పిన వాటిని దురుద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రాజకీయ లబ్ది పొందాలనే వక్ర బుద్దే తప్ప,తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలనే తపన లేదని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లోని అజెండా 5లోని అంశాలు దాచిపెట్టి, అజెండా నెం.1 అంశాలను మాత్రమే ప్రస్తావించారని విమర్శించారు. గోదావరి -కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్టుల విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే అందుకు తెలంగాణ అంగీకరించదు అని కెసిఆర్ అజెండా 5లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని కావాలని దాచిపెట్టి, స్వార్థపూరిత రాజకీయ లక్ష్యాల కోసం అసత్యాలను సిఎం రేవంత్‌రెడ్డి ప్రజల ముందు ఉంచారని, ఈ విషయంలో సిఎం మీడియాను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. అబద్దాల పునాదుల మీద జరిగిన ఈనాటి రేవంత్ తతంగాన్ని ప్రజలు విశ్వసించరు అని హరీష్‌రావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News