- Advertisement -
లక్నో: పట్టపగలు నడిరోడ్డుపై ప్రియుడు, ప్రియరాలు కొట్టుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. గోమతినగర్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ యువతి, యువకుడు పట్టపగలు నడిరోడ్డుపై ఘర్షణకు దిగారు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురుపించుకున్నారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. వీరు ఎందుకు గొడవపడ్డారనేది మాత్రం తెలియలేదు. గోమతి నగర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఎవరు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతోనే కొట్టుకొని ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Advertisement -