Thursday, June 19, 2025

నాలుగో స్థానంలో గిల్..

- Advertisement -
- Advertisement -

స్పష్టత ఇచ్చిన పంత్
హెడింగ్లే: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. గతంలో ఈ స్థానంలో విరాట్ కోహ్లి దిగేవాడు. కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో గిల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వెల్లడించాడు. కీలకమైన ఈ స్థానంలో గిల్ దిగితేనే ప్రయోజనంగా ఉంటుందన్నాడు. మూడో స్థానంలో ఎవరిని దించాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయన్నాడు. టెస్టు ఆరంభానికి ముందు దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉందన్నాడు. మీడియాతో ముచ్చటించిన పంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News