- Advertisement -
లక్నో: హోటల్ రూమ్లో ప్రియుడితో ఉండగా భర్త రావడంతో భార్య భవనం పైనుంచి కిందికి దూకి పారిపోయింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బాగ్పత్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బడౌత్ పట్టణంలో శోభిత్ అనే వ్యక్తి తన ప్రియురాలుతో కలిసి హోటల్ రూమ్కు వచ్చాడు. అదే సమయంలో హోటల్కు భర్త రావడంతో భార్య గమనించింది. హోటల్ భవన పైనుంచి దూకి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. భార్య, ఆమె ప్రియుడితో తనకు ప్రాణహాని ఉందని స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని భార్యకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ దంపతులకు 2019లో వివాహం జరగగా ఒక కుమారుడు ఉన్నాడు.
- Advertisement -