Friday, June 20, 2025

ముంబయిలో భారీ వర్షాలు..

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. రోడ్లపై నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఎవరు బయటకు రావడంలేదు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. బుధవారం సాయంత్రం నుండి ఇప్పటివరకు 200 మి.మీ. వర్షపాతం నమోదైందని వెల్లడించింది.

ముంబయి, పరిసర ప్రాంతాలకు ఐఎండి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కురస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.  లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతుండడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అధికారిక సూచనలను పాటించడంతో పాటు అపోహలకు లోనుకావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News