శ్రీలంక 368/4, బంగ్లాతో తొలి టెస్టు
గాలె: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య శ్రీలంక దీటైనా జవాబిస్తోంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 153.4 ఓవర్లలో 495 పరుగులకు ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన శ్రీలంక గురువారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 93 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే లంక మరో 127 పరుగులు చేయాలి. మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన లంకకు ఓపెనర్ పాథుమ్ నిసాంకా అండగా నిలిచాడు. అతనికి మరో ఓపెనర్ లహిరు ఉడారా, దినేశ్ చండీమల్ అండగా నిలిచారు.
లహిరు 6 ఫోర్లతో వేగంగా 29 పరుగులు చేసి ఔటయ్యాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన చండీమ్ 119 బంతుల్లో 4 ఫోర్లతో 54 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పాథుమ్తో కలిసి రెండో వికెట్కు 157 పరుగుల భాగస్వామ్యంలో పాలుపంచుకున్నాడు. ఇక చెలరేగి ఆడిన పాథుమ్ నిసాంకా 256 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్స్తో 187 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు సీనియర్ ఆటగాడు ఎంజిలో మాథ్యూస్ (39) పరుగులు చేశాడు. ఆట ముగిసే సమయానికి కమిందు మెండిస్ (37), కెప్టెన్ ధనంజయ డిసిల్లా 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.