Friday, June 20, 2025

ప్రేమపెళ్లి.. అప్పుడు టాబ్లెట్లు మింగించి… రెండో పెళ్లికి సిద్ధమైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో మోజు తీరాక మరో యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో యువతి తన తల్లితో కలిసి న్యాయ పోరాటానికి సిద్ధపడింది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీధర్ అనే యువకుడు, స్రవంతి అనే యువతికి మాయమాటలు చెప్పి ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు ఇద్దరు అన్యోనంగా జీవించారు. పిల్లలు వద్దని చెప్పి పలుమార్లు ఆమె ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఇప్పుడు శ్రీధర్ రెండో పెళ్లికి సిద్ధంకావడంతో తాను మోసపోయానని స్రవంతి గ్రహించింది. ‘నీతో మోజు తీరింది, ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటా’ అని యువతిని శ్రీధర్ బెదిరించాడు. భర్త రెండో పెళ్లికి సిద్ధం కావడంతో ఆయన ఇంటి ముందు తన తల్లితో కలిసి స్రవంతి ధర్నాకు దిగింది. న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదలనని మీడియాకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News