హైదరాబాద్: కేంద్రం మానవీయ కోణంలో ఆలోచించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని బిఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత తెలిపారు. 5 గ్రామాల ప్రజలకు అనారోగ్యం వస్తే గుంటూరు ఆసుపత్రికి వెళ్లాలని అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోలవరం తెలంగాణపై జలఖడ్గం పేరిట సదస్సు (Conference name sword water) జరిగింది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కవిత హాజరయ్యారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఈ నెల 25న 4 రాష్ట్రాల సిఎంలతో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సమావేశం ఏర్పాటు చేయాలని, సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. 5 గ్రామాల్లో వెనక్కి తీసుకొచ్చేలా సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని, కరకట్టల ఎత్తు పెంచుకోవాలని, లేకపోతే రక్షణ ఉండదని తెలియజేశారు. భారీ వరదలు వస్తే ఆయా గ్రామాలు మునిగిపోతాయని కవిత పేర్కొన్నారు.
తెలంగాణకు 5 గ్రామాలను తిరిగి ఇస్తున్నట్లు ప్రకటించాలి: కవిత
- Advertisement -
- Advertisement -
- Advertisement -