హైదరాబాద్: టీమిండియా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 85 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 359 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఈ మ్యాచ్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. యశస్వి జైస్వాల్ 159 బంతుల్లో 101 పరుగులు చేసి స్టోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్మాన్ రికార్డును ఓపెనర్ యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్తో ఆడిన పది ఇన్నింగ్స్లో 90.33 సగటుతో జైస్వాల్ 813 పరుగులు చేశాడు.
మినిమం ఐదు వందల పరుగులు విషయంలో ఇంగ్లాండ్ జట్టుపై డాన్ బ్రాడ్మాన్ రికార్డును జైస్వాల్ బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ జట్టుపై బ్రాడ్మాన్ 63 ఇన్నింగ్స్లో 89.78 యావర్జ్తో 5028 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ జట్టు 90 కంటే ఎక్కువ సగటు కలిగిన బ్యాట్స్మెన్గా జైస్వాల్ రికార్డు సృష్టించాడు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ 102 బంతుల్లో 65 పరుగులు చేసి మూడు వేల పరుగుల క్లబ్లో చేరాడు. కెప్టెన్ గిల్ 175 బంతుల్లో 127 పరుగులు చేసి 2000 వేల పరుగుల క్లబ్లో చేరాడు.