హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ప్రతి విషయంలో కోతలు పెడుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి కాదని..కోతల రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రైతు భరోసా కోసం జిన్నారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వచ్చినా మాజీ సిఎం కెసిఆర్ ఎలాంటి పరిమితులు లేకుండా రైతులకు రైతు బంధు నిధులు ఇచ్చారని తెలిపారు. రెండు రైతు భరోసా (Farmer Assurance) నిధులు రేవంత్ రెడ్డి ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని అన్నారు ఇంకా కాలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు పూర్తిగా రుణమాఫీ చేయలేదో చెప్పాలని హరీష్ రావు అన్నారు. చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని, రుణమాఫీ చేయకుండా రైతులను పూర్తిగా ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది రైతులకు రైతు భీమా డబ్బులు రాలేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
చాలా మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -