మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 (బి) ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం శనివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ డిపిఆర్తో పాటు అవసరమైన అన్ని పత్రాలు కేంద్రానికి సమర్పించారు. ఫేజ్ 2 (బి)లో మొత్తం 86.1 కిలోమీటర్ల దూరం కలిగిన మూడు కా రిడార్లు ఉన్నాయి. మొత్తం ఖర్చు రూ. 19, 579 కోట్లుగా అంచనా వేశారు. ఆర్జిఐఎ (శంషాబాద్) నుండి భారత్ ఫ్యూచర్ సిటీ – 39.6 కి.మీ (రూ.7,168 కోట్లు), జెబిఎస్ నుండి మేడ్చల్- 24.5 కి.మీ (రూ. 6,946 కో ట్లు), జెబిఎస్ నుండి షామీర్పేట్ -22 కి.మీ (రూ. 5,465 కోట్లు) గా ప్రతిపాదించారు.
గతంలో పంపిన ఫేజ్ 2 (ఎ) (76.4 కి.మీ, ఐ దు కారిడార్లు) మాదిరిగానే, ఫేజ్ 2 (బి) ప్రా జెక్ట్ను కూడా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్య (జెవి) ప్రాజెక్టుగా అ భివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.
తెలంగాణ ప్రభుత్వం వాటా: రూ. 5,874 కోట్లు (30 శాతం)
కేంద్ర ప్రభుత్వం వాటా: రూ. 3,524 కోట్లు (18 శాతం)
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి ఋణం: రూ.9,398 కోట్లు(48 శాతం)
పిపిపి భాగస్వామ్యం: రూ. 783 కోట్లు (4%)