లక్నో: ప్రియుడితో భర్తను ప్రియురాలు తుపాకీ కాల్చి చంపించింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హిమాచల్ గ్రామానికి చెందిన రిషికుమార్(30) అనే యువకుడు, లలిత అనే అమ్మాయిని రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రిషికుమార్ లారీ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రిషి బాబాయి కుమారుడు నీరేశ్తో లలిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో అతడిని తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. భర్తను చంపాలని వరసకు మరిదయ్యే నీరేశ్తో చేతులు కలిపింది. నీరేశ్, రిషి ఇద్దరు కలిసి బంధువుల పెళ్లికి వెళ్లారు. మద్యం తాగేందుకు రిషిని నీరేశ్ పక్కకు పిలిచి అనంతరం తుపాకీ తీసుకొని అతడిపై కాల్పులు జరిపి పారిపోయాడు. తన భర్తను హిమాచల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్య చేశాడని కరాఖండీగా చెప్పి కేసును తప్పుదోవ పట్టించింది. లలితపై అనుమానాలు రావడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకుంది.
వదిన కోసం అన్నను తుపాకీతో కాల్చి చంపిన కజిన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -